Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

చికిత్స పొందుతున్న బాలుడికి ఆర్థిక సహాయం

విశాలాంధ్ర- గూడూరు: గూడూరు మండల ఆకుమర్రు గ్రామంలో కమ్మగంటి రమణ, శాంతి కుమారి భార్యాభర్తలు గర్భిణీ స్త్రీ అయిన శాంతి కుమారి డెలివరీ నిమిత్తం హాస్పిటల్ లో చేరారు డెలివరీ సమయంలో భార్య శాంతి కుమారి మగ బిడ్డకి జన్మనిచ్చి మృతి చెందింది. బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందున చికిత్స నిమిత్తం పెడన టిడిపి ఇన్చార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ 5000 వేల రూపాయలు ,గూడూరు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగం 17000 వేల రూపాయలు మరియు మల్లవోలు హెల్పింగ్ హాండ్స్ వారు 5000 రూపాయలు, బోలా. రాజేష్ 3000 రూపాయలు పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కాగిత కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా బాధితులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన స్వామి, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గోపి నాగబాబు , అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన్ త్రినాథ్ ,ప్రత్తిపాటి శ్రీనివాసరావు గూడూరు మండల ఎస్సీ సెల్ విభాగ సభ్యులు బేతాళ స్వామి, గుంటూరు వెంకటరత్నం, అట్లూరి శ్రీను, గడ్డం నాగరాజు, పెనుమచ్చ అశోక్ ,ఉడుముల నరేష్ ,దోమతోటి సుధాకర్, గోవాడ కొండ పెనుమాక కొండ దాసరి వెంకన్న బాబు పెనుమాక వినయ్ కమ్మగంటి స్వామి మిట్ట వేణుబాబు మరియు పార్టీ నాయకులు బత్తిన వీరబాబు బాసం శెట్టి శ్రీను గంజాల వెంకటేశ్వరరావు బల్లా రామ్ మోహన్ రావు మహమ్మద్ ఇమ్రాన్, ఎన్ ఎ బెగ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img