Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి

విశాలాంధ్ర -గూడూరు: భారతరత్న, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని శుక్రవారం గూడూరు మండల ప్రజా పరిషత్ (ఉర్దూ) పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్. అలీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి, ఆయన మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు , భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బచ్చుల. వెంకట రాజారావు, పాఠశాల కో ఆప్షన్ సభ్యులు ఎం డి. బషీర్, ఎం. ఎ. సలీం, మైనార్టీ నాయకులు ఎం.డి సాహెబ్( దాదా), ఉపాధ్యాయురాలు రజియా సుల్తానా, ఉపాధ్యాయుడు అలీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img