Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మండలంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

నందిగామ విశాలాంధ్ర రూరల్ న్యూస్..: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ తెలుగుదేశం పార్టీ సహకారంతో తొర్రగుడిపాడు గ్రామంలో సర్పంచ్ చెరుకూరు హైమారావు గృహము నందు శుక్రవారం నిర్వహించడం జరిగినది ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి
అందరికీ మిఠాయిలు పంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కార్యకర్తలుగా ఇప్పటివరకు పార్టీలో ఉండి పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీకి సేవలు అందించినటువంటి సీనియర్ నాయకులు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెరుకూరు కోటేశ్వరరావు ని మరియు మాజీ ఎంపీపీ మన్నే కళావతి ని సన్మానించడం జరిగినది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే పేద బడుగు బలహీన వర్గాలకు నిజమైన స్వతంత్రం స్వేచ్ఛ రాజకీయ వాతావరణం ఏర్పడి ప్రజా క్షేమమే లక్ష్యంగా సంక్షేమాలకు నిలయంగా తెలుగు జాతి ఎదిగిందని తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలుగా ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడిందని రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల శక్తి సామర్థ్యాలు నారా చంద్రబాబునాయుడు గారికి ఒక్కరికే ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రజా విశ్వాసంతో అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేసి ఇప్పుడు జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరంకి వీరాస్వామిన్,తోట నాగమల్లేశ్వరరావు(బుజ్జి), హైమారావు,గాంధీ, వెంకట్రావు,పల్లెపోగు ప్రభుదాసు,మాదల సురేష్, సూర్యదేవర వెంకట్రావు,చావా మురళి,వాసిరెడ్డి రాంబాబు, కలకట్ల కార్తీక్,తానూరు వెంకటేశ్వర్లు,చెరుకూరు చందు, సుధాకర్,చావా వినయ్, వాసిరెడ్డి శరభయ్య,తదితర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img