Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సచివాలయాల పనితీరు భేష్‌

విశాలాంధ్ర`విజయవాడ (వన్‌టౌన్‌) : విజయవాడ వార్డు సచివాలయాల పనితీరు భేష్‌ అని పాజెక్ట్‌ ఆఫీసర్‌ కె. శకుంతల అన్నారు. శనివారం చుట్టుగుంట లోని 32, 33, 34, 35 వార్డు సచివాలయాల పనితీరును ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ కె. శకుంతల పరిశీలించి, సిబ్బంది పనితీరును అభినంధించారు. విజయవాడలోని కార్పొరేషన్‌ పరిధిలోని 18 సంవత్సరాలు పైబడిన మహిళలు చుట్టుగుంటలోని బ్రహ్మానందరెడ్డి నగర్‌ వి.ఎం.సి. కాంప్లెక్స్‌లో ఉచితంగా కుట్టు మిషను శిక్షణ నేర్చుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం నేర్చుకుంటున్న 25 మంది పనితీరును పరిశీలించి అభినందిచారు. 2వ డివిజన్‌ కార్పొరేటర్‌ నిర్మలకుమారి, 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ వి. అమర్‌నాథ్‌, వి.ఎం.సి. సి.ఒ. ఎం. కొండబాబు, వార్డు సెక్రటరీలు చిన్నబాబు, శాక్షి, సుజల, గోపి, రహీమ్‌, రాజు, సాంబశివరావు, మురళి, వాలంటీర్లు కె. ఉమామహేశ్వరి, ధనలక్ష్మి, జయరమ్‌, బి. లిక్తకళ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img