Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రూ.కోటి 69 లక్షల విలువైన మద్యం సీసాల ధ్వంసం

మైలవరం-నవంబర్: మైలవరంలో పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గంపలగూడెం,విస్సన్నపేట, జి.కొండూరు, తిరువూరు, ఏ కొండూరు మండలాల పరిధిలో గత కొంతకాలంగా పక్క రాష్ట్రం నుండీ అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యం సుమారు కోటి 69 లక్షల రూపాయలకు పైగా విలువ గలిగిన మద్యాన్ని, 82, 955 మద్యం బాటిల్స్ ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న వివిధ బ్రాండ్ల మద్యం బాటిల్స్ ధ్వంసం చేయడం జరిగిందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం తిరువూరు విసన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నాటుసార తయారీదారులపై నాలుగు పిడి యాక్ట్లు పెట్టడం జరిగిందని,కేసులు నమోదైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని ఆమె తెలిపారు.వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోలీసు శాఖ తరపున జాబ్ మేళాలు నిర్వహించడం జరిగిందన్నారు.అక్రమంగా పక్క రాష్ట్రం నుంచి ఎవరో మద్యం రవాణ చేయకూడదని చేసిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని ఆమె హెచ్చరంచారు.ఈ కార్యక్రమంలో ఏసీబీ ఏ ఎన్ సి పి మోకా సత్తిబాబు, పీ నారాయణస్వామి, ఏసిపి కెవి ఎన్వి ప్రసాదు, తిరువూరు,మైలవరం, ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్, ఏసిపి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img