విశాలాంధ్ర` పెద్దకడబూరు : మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలోని బీసీ స్మశాన వాటికకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో సోమవారం ఎంపీ నిధులు 10 లక్షల వ్యయంతో మరమ్మతులకు గ్రామ సర్పంచ్ జానకమ్మ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్ళుగా బీసీలు స్మశాన వాటిక కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై మండల వైకాపా నేతలు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి లతోపాటు గ్రామ నాయకులు దేవదానం, నాగన్న, తిమ్మప్ప, భాస్కర్, ఖాజా, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని బీసీల స్మశాన వాటిక మరమ్మతులకు ఎంపీ నిధులు 10 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. దీంతో గ్రామ సర్పంచ్ జానకమ్మ జేసిబితో పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.