Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

జగనాసురరక్త చరిత్ర పై -కాగిత కొత్త కామెంట్స్

విశాలాంధ్ర- గూడూరు ..పెడన నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ సోమవారం గూడూరు గ్రామంలో, పార్టీ నాయకుడు గొరి పర్తి రాజబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,కోడి కత్తి డ్రామాలతో అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక్క క్షణం కూడా పరిపాలించే హక్కు లేదని తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని పెడన నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు, సొంత బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేసి ఎదుటి వారి మీద నిందలు మోపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని, బాబాయి ఆరోజు చనిపోయి రక్తపు మడుగులో పడి ఉంటే గుండెపోటు డ్రామాలు ఆడారని, తరువాత గొడ్డలి తీసుకువచ్చి గొడ్డలిపోటు అనే డ్రామాలు ఆడారని జగన్ అవినాష్ రెడ్డి ఇద్దరూ వాళ్ళ ఎంపీ సీటుకి అడ్డుపడుతున్నాడని బాబాయిని చంపి ఆ నిందను టిడిపి వారు అని బురద చెల్లారనిఅన్నారు, మరియు టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై నమ్మకం లేకనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిబిఐ ను ఆమె కూతురు సునీత ఆశ్రయించారని అన్నారు, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని, ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన స్వామి, గోపి నాగబాబు, కట్టమనేశ్వరరావు, ఎన్ ఏ బేగ్, కస గాని శ్రీనివాసరావు, సమ్మెట ఈశ్వరరావు, గొరి పత్తి బుచ్చిరాజు, రావి సత్యనారాయణ, బేతాళ స్వామి, మురాల నాని, జొన్నలగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img