Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా సిపిఐ ప్రచారం

విశాలాంధ్ర= ఆస్పరి : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పిడిఎఫ్‌) ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి లకు మద్దతుగా ఆస్పరిలో సిపిఐ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు గురువారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, సీపీఐ సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, ఉరుకుందప్పలు మాట్లాడుతూ.. పెద్దల సభలో ప్రజా సమస్యలను ప్రశ్నించే పటిమ ఉన్న వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంచి వ్యక్తి, విద్యాధికుడు, మాజీ ఉపాధ్యాయుడు అయిన పోతుల నాగరాజును, ఉపాధ్యాయ సమస్యల పై గతంలో అనేక ఉద్యమాలు చేసిన కత్తి నరసింహారెడ్డి లను గెలిపిస్తే వారు ప్రజావాణి వినిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈశ్వర్, ఏఐటీయూసీ నాయకులు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img