Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చలివేంద్రం ఏర్పాటు

విశాలాంధ్ర -బొమ్మనహల్: స్వర్గీయ మాజీ సమితి అధ్యక్షులు పయ్యావుల రామప్ప ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రమైన బొమ్మనహల్ తాసిల్దార్ కార్యాలయం సమీపాన తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల అనిల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు ఎండాకాలంలో దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జగన్నాథ్ రెడ్డిమాజీ మండల ఉపాధ్యక్షులు పయ్యావుల మోహన్ బాబు సర్పంచ్ వన్నమ్మ లాలు స్వామి ఉప సర్పంచ్ పయ్యావుల హనుమంతప్ప మాజీ సర్పంచులు పెద్ద రామన్న సులేమాన్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img