Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ

విశాలాంధ్ర – ఆదోని : సచివాలయ సిబ్బందితో పెన్షన్ దారులకు తమ ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 4, 5 తేదీల్లో రెండు రోజులపాటు పెన్షన్ దారులకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్ పంపిణీ చేసే సచివాల ఉద్యోగులు వాలంటరీ సహాయం తీసుకోకూడదని, ఎలాంటి రాజకీయ ప్రచారాలు కూడా చేయరాదని సూచించారు. పెన్షన్ దారులు ఎలాంటి వ్యయప్రాసాలకు గురి కాకుండా, ఉండాలని సచివాలయ ఉద్యోగులు తమ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ డబ్బులు అందజేస్తారని తెలిపారు. పట్టణంలో 17340 మంది పెన్షన్ దారులు ఉన్నారని రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img