విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ప్రాథమిక సహకార పరపతి సంఘం నందు రుణాలు తీసుకున్న రైతులు సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకోవాలని సహకార సంఘం సీఈఓ మురళీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సహకార పరపతి సంఘం నందు సభ్యత్వాలు యధావిధిగా కొనసాగాలంటే రైతులు వారికి సంబంధించిన పొలం, సహకార సంఘం పాసుపుస్తకాలు, ఆధార్ కార్డు, పాన్ కార్డులు జిరాక్స్ కాపీలతో పాటు రెండు ఫోటోలను సంఘం సిబ్బందికి అందజేయాలని సూచించారు. అందజేయని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు వర్తించవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కంప్యూటరీకరణలో భాగంగా సభ్యత్వము కలిగిన రైతులందరూ వివరాలను ఇవ్వాలని కోరారు.