విశాలాంధ్ర, పెద్దకడబూరు :ఫర్టిలైజర్స్ షాపులలో నకిలీ విత్తనాలను, మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని సొసైటీ, ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారి వరప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి నెల స్టాక్ రికార్డును వ్యవసాయ కార్యాలయంలో సమర్పించాలన్నారు. దుకాణాలలో నకిలీ విత్తనాలను, ఎరువులను విక్రయించొద్దని అలా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువులను, మందులను ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్నారు. విక్రయించిన ప్రతి దానికి రైతుకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు.