ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జనాభా గణన కోసం నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటే పార్లమెంట్లోనూ, అలాగే బయట.. కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీపరంగా మద్దతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. దేశంలో ఓబీసీల జనాభా గణనను బీఎస్పీ డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఏదైనా సానుకూల అడుగు వేస్తే పార్లమెంటు లోపల, వెలుపల మద్దతు తెలిపుతామని శుక్రవారం మాయావతి ట్వీట్ చేశారు.