వడ్డీ రేట్లను వరుసగా ఏడోసారీ మార్చలేదు. గృహ, ఆటో రుణదారులకు ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. రెపో రేటును 4 శాతం వద్దే ఉంచారు. ద్రవ్యపరపతి విధాన సమీక్ష విషయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని ఆర్బీఐ పేర్కొన్నది.2021-22లో జీడీపీ వృద్ధి 9.5 శాతం ఉంటుందని, ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని..నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.8 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచానా వేసింది.