50మంది మహిళలకు ఛాన్స్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను ఆ రాష్ట్ర కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ యూపీ ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, మా అభ్యర్థుల్లో 40 శాతం మంది మహిళలే ఉంటారన్నారు. 125 మంది అభ్యర్థుల తొలి జాబితాలో 50 మంది మహిళలు ఉన్నారని ప్రియాంక గాంధీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రాజకీయాలకు నాంది పలుకుతూ కష్టపడుతున్న వారే మా అభ్యర్థులు కావాలని ప్రయత్నించామన్నారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశాదేవికి కూడా కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వడం విశేషం. కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూయిస్ ఖుర్షీద్కు కూడా కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది.