ఆఫ్ఘనిస్థాన్లో చోటు చేసుకుంటోన్న పరిణామాలు, తాలిబన్ల తీరుపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వరుసగా పలు దేశాల అధికారులతో సమావేశమవుతున్నారు. నేడు దిల్లీలో భారత్, రష్యా జాతీయ భద్రతా సలహాదారుల బృందం సమావేశమైంది. రష్యా భద్రతాధికారి నికోలోయ్ పాత్రోసేవ్తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బృందం చరిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిణామాలపై చైనా, పాకిస్థాన్ అంశాలపైనా రెండు దేశాల అధికారులు చర్చించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పాత్రోసేవ్ ప్రధాని మోదీని కూడా కలవనున్నారు. అన్ని దేశాల తరహాలోనే, ఆఫ్ఘనిస్తాన్లో సమగ్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రష్యా కూడా భావిస్తున్నట్లు పాత్రోసేవ్ తెలిపారు.