Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

అమిత్‌షా అబద్ధాలు : ప్రియాంక

న్యూదిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ శనివారం విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌ రోడ్లపై అర్ధరాత్రి 16 ఏళ్ల బాలిక స్వేచ్ఛగా బంగారు ఆభరణాలతో తిరుగుతోందంటూ అమిత్‌షా చెప్పడాన్ని ప్రియాంక తప్పుబట్టారు. అమిత్‌షా మోసపు మాటలు చెబుతున్నారని, ప్రతిరోజు ఎలా ఉంటున్నారో రాష్ట్ర మహిళలను అడిగితే చెబుతారని ప్రియాంక అన్నారు. కాన్పూరులో ముగ్గురు మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లిన వార్తలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రాష్ట్రంలో బీజేపీ పాలన ఎలా ఉందో ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ హోంమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో ఎవరినడిగినా చెబుతారని ప్రియాంక పేర్కొన్నారు. భద్రతకు సంబంధించి విధానాలు మెరుగుపడటానికి రాజకీయాల్లో మహిళల పాత్ర పెరగాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. యూపీలోని ఓ బహిరంగ సభలో అమిత్‌షా ఇటీవల మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రశంసించారు. 16 ఏళ్ల బాలిక యూపీ రోడ్లపై అర్ధరాత్రి స్కూటర్‌ నడుపుకుంటూ ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా వెళ్ల వచ్చని అమిత్‌షా అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img