కొవాగ్జిన్ టీకాపై రెండు, మూడో దశల క్లినికల్ ట్రయల్స్ను భారత్ బయోటెక్ పూర్తి చేసింది. పీడియాట్రిక్ కొవాగ్జిన్ రెండు, మూడో దశ ట్రయల్స్ పూర్తయ్యాయని, దీనికి సంబంధించిన డేటాను వచ్చే వారంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించే అవకాశం ఉన్నదని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడిరచారు.వెయ్యి మంది చిన్నారులపై ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఇంట్రానసల్ వ్యాక్సిన్ ట్రయల్స్ సైతం రెండో దశలో ఉన్నాయని తెలిపారు. అక్టోబర్లో పూర్తవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.భారత్ బయోటెక్ ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉందని కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో అవసరాన్ని తీర్చడమే తమ ప్రయత్నమని చెప్పారు.