Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జగ్జీవన్‌రాంకు ఘన నివాళి

న్యూదిల్లీ: మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా మంగళవారం జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంది. స్వాతంత్య్ర పోరాటం, అనంతరం జగ్జీవన్‌రాం దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలకు విశేషమైన కృషి చేశారన్నారు. రాష్ట్రపతి రామ్‌నాధ్‌కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హోంమంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్‌, పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img