జమ్మూలోని కథువా జిల్లాలో భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. రంజిత్ సాగర్ డ్యామ్ సరస్సు సమీపంలో భారత సైన్యం హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో హెలికాఫ్టర్లో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.రొటీన్ ట్రిప్లో భాగంగా ఆర్మీ ఏవియేషన్ ఏఎల్హెచ్ ధ్రువ హెలికాప్టర్ వెళ్తుండగా ప్రమాదానికి గురయిందని అధికారులు తెలిపారు. ది వెపన్ సిస్టం ఇంటిగ్రేటెడ్ హెలికాప్టర్ అని, పఠాన్కోట్ (పంజాబ్) నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డిఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.