Friday, April 26, 2024
Friday, April 26, 2024

ట్విట్టర్‌ మాజీ ఉద్యోగులకు ‘కూ’ పిలుపు

ట్వట్టర్‌ రెస్ట్‌ ఇన్‌ పీస్‌ అంటూ ట్వీట్‌
ట్విట్టర్‌ మాదిరి సేవలు అందించే దేశీ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ‘కూ’.. ఇప్పుడు ట్విట్టర్‌ నుంచి తొలగించబడిన ఉద్యోగులకు ఆహ్వానం పలికింది. ప్రపంచ సంపన్నుడైన టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇటీవలే ట్విట్టర్‌ ను కొనుగోలు చేసిన తర్వాత.. ఉద్యోగుల పాలిట యముడిలా మారిపోవడం తెలిసిందే. అద్భుతంగా పనిచేయాలి.. రోజులో 18 గంటలు పనిచేయాలి.. అలా అయితేనే ఉండండంటూ మస్క్‌ తేల్చి చెబుతున్నారు. అంతకుముందు సగం మంది ఉద్యోగులను ఆయన పీకి పారేశాడు. ముఖ్యంగా భారత్‌ లో అయితే 90 శాతం మంది ఉద్యోగులను తొలగించాడు. ఈ పరిస్థితిని ట్విట్టర్‌ పోటీ సంస్థ కూ తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడిరది. మరింత ప్రచారానికి చర్యలు తీసుకుంటోంది. ట్విట్టర్‌ లో ఎక్కువ మంది ఉద్యోగులు వెళ్లిపోవడంతో ప్లాట్‌ ఫామ్‌ నిదానించింది. దీంతో అక్కడి యూజర్లను కూ ఆకర్షించే చర్యలు మొదలు పెట్టింది. కొత్త ఫీచర్లను ప్రకటిస్తోంది. కూ సహ వ్యవస్థాపకుడు మయాంక్‌ బిదవత్క మాట్లాడుతూ.. నిపుణుల కోసం తాము అన్వేషిస్తున్నామని, ముఖ్యంగా ఇటీవల మస్క్‌ తొలగించిన వారిని ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img