బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీకి చెందిన సుమారు 48 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఆ రాష్ట్రానికి చెందిన ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో మాజీ మంత్రి పార్ధా ఛటర్జీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. అయితే డిపార్టమెంట్ పంపిన ఫైళ్లపైనే తాను సంతకం చేసినట్లు విచారణలో మంత్రి వెల్లడిరచారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో తన పాత్ర చాలా స్వల్పమైందని, అధికారుల్నే తాను నమ్మినట్లు మాజీ మంత్రి తెలిపారు.