ఈ నెల 19 నుంచి ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారయ్యింది. జూలై 19 నుంచి ఆగస్టు 13 సమావేశాలు కొనసాగుతాయని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. ఈ రోజుల్లో సెలవు దినాలు మినహా మొత్తం 19 రోజులపాటు ఉభయసభల కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు. ఇందుకు సంబంధించి స్పీకర్ ఓంబిర్లా ఇవాళ ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి వచ్చే ఎంపీలు, మీడియా ప్రతినిధులు అందరినీ పార్లమెంటు లోపలికి అనుమతిస్తారని స్పష్టంచేశారు.ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి కాదని, అయితే వ్యాక్సిన్ వేయించుకోని వారు మాత్రం దయచేసి వ్యాక్సిన్లు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశాలు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు.