మళ్లీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపు నిర్ణయం ఈరోజు నుంచే అమలులోకి రానుంది.అయితే ఈసారి 19 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు మాత్రమే పెరిగింది. సాధారణ ప్రజలు ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సిలిండర్కు రూ. 43.50 పెంచింది. సవరించిన రేట్ల ప్రకారం, దేశ రాజధాని ఢల్లీిలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1693 నుంచి రూ .1736.50 కి పెరిగింది. కోల్కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 35 పెరిగి రూ .1805.5 కి చేరుకుంది. ముంబైలో ధర రూ. 35.5 పెరిగి రూ .1685. చెన్నైలో రూ. 36.5 పెరిగి రూ. 1867.5 కి చేరుకుంది.