Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భారత్‌ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్‌ గాంధీ…

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర బుధవారం సాయత్రం ప్రారంభం అయ్యింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్‌ తన యాత్రను ప్రారంభించారు. తన ముందు పార్టీ సేవా దళ్‌ శ్రేణులు కదం తొక్కుతూ సాగగా… రాహుల్‌ గాంధీ తన సుదీర్ఘ యాత్రను ప్రారంభించారు. దాదాపుగా 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగియనుంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగేలా కాంగ్రెస్‌ పార్టీ రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. రాహుల్‌ గాంధీ యాత్ర చేపట్టడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img