పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీం ప్రశ్న
న్యూదిల్లీ : సోషలిస్ట్ (సామ్యవాద), సెక్యులర్ (లౌకిక) పదాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలోనే కీలకమైనవని ఎన్నో తీర్పులు నొక్కిచెప్పాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ పీఠిక నుంచి ఈ పదాలను తొలగించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్, న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తన వాదనలు వినిపిస్తూ… రాజ్యాంగానికి 1976లో చేపట్టిన 42వ సవరణపై పార్లమెంట్లో చర్చే జరగలేదన్నారు. దీనిపై జస్టిస్ ఖన్నా స్పందిస్తూ… ఈ పదాలకు వివిధ వివరణలున్నాయని… వేర్వేరుగా అన్వయించుకుంటున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో కోర్టులు చాలాసార్లు ఇవి రాజ్యాంగంలోని ప్రాథమిక భాగాలుగా అభివర్ణించినట్లు వెల్లడిరచారు. ‘సోషలిజం అంటే… అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, సమానత్వం అనే అంశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది, మీరు దీనిని మరో రకంగా చూడకూడదు, అప్పుడు వేరే అర్థం కూడా వస్తుంది. ఇక సెక్యులర్ అనే పదం కూడా అంతే’ అని ఖన్నా వ్యాఖ్యానించారు. మరో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ తన వాదనలు వినిపిస్తూ… ఈ సవరణ అమల్లోకి వచ్చేనాటికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్పందిస్తూ ‘మీరు భారత్ లౌకిక దేశంగా ఉండాలను కోవడంలేదా..?’ అని సూటిగా ప్రశ్నిం చారు. దీనిపై అడ్వకేట్ జైన్ బదులిస్తూ ‘భారత్ లౌకిక దేశంగా ఉండకూడదని మేము అనడంలేదు. ఆ సవరణను మాత్రమే సవాలు చేశాం’ అని పేర్కొ న్నారు. పీఠికలో ఈ రెండు పదాలు చేర్చ డం వల్ల పాండోరా బాక్స్ను తెరిచినట్లు అయిందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రజాస్వామ్యం అనే పదాన్ని కూడా తొలగించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తన వాదనలు వినిపిస్తూ… పీఠికలో 26 నవంబరు, 1949 తేదీ ఉండటం తప్పని నిరూపిస్తానని పేర్కొన్నారు. ‘మనకు రాజ్యాంగ పీఠిక రెండు భాగాలుగా ఉండొచ్చు. కానీ, సెక్యులరిజం, సోషలిజం పదాలు చేర్చడానికి భారత ప్రజలు అంగీకరించా రని చెప్పడం సరికాదు. పీఠిక రెండు భాగాల్లో ఒక దానిని తేదీతో, మరో దానికి డేట్ లేకుండా ఉంచవచ్చు’అని పేర్కొ న్నారు. దీనిపై జస్టిస్ ఖన్నా స్పందిస్తూ… పిటిషనర్లు సంబంధిత పత్రాలను సమర్పిస్తే పరిశీలిస్తామని చెప్పారు. నోటీసులు జారీ చేయడానికి మాత్రం బెంచ్ అంగీకరిం చలేదు. తదుపరి వాదనలను నవంబరు 18న వింటామని న్యాయమూర్తులు పేర్కొన్నారు.