రాజ్యసభ సమావేశాలు మార్చి 14 వ తేదీకి వాయిదా పడిరది.పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి.కోవిడ్ కారణంగా రెండు విడతలుగా పార్లమెంటు సమావేశాలను జరపాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల్లో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్ సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటి విడత పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆమోదించడం వంటివి జరిగాయి. వచ్చే నెల 14వ తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభలో ఈరోజు సభ్యులు కొంత గందరగోళం జరగడంతో రాజ్యసభను వాయిదా వేశారు. తిరిగి వచ్చే నెల 14 వతేదీన మొదలు కానుంది.