నెటిజన్ల మండిపాటు
న్యూదిల్లీ: నరేంద్రమోదీ బలహీన ప్రధాని అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉక్రెయిన్` రష్యా మధ్య తలెత్తిన వివాదంతో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను దేశానికి చేర్చడంలో విఫలమయ్యారంటూ ‘ఇండియా యాజ్ వీక్ పీఎం’ అనే యాష్ టాగ్తో సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న పోస్టులు విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఉక్రెయిన్లో ఉంటున్న కర్ణాటకకు చెందిన భారతీయ విద్యార్థి నవీన్ మృతిని ప్రస్తావిస్తూ మోదీ తన పదవికి రాజీనామా చేయాలంటూ కొందరు డిమాండు చేస్తున్నారు. ఆ దేశాల మధ్య యుద్దం ప్రారంభంకాకమునుపే అమెరికా, బ్రిటన్ సహా వివిధ దేశాలు తమ పౌరులను తరలించేశాయని, ఆ సమయంలో మోదీ ఏమి చేశారని ప్రశ్నిస్తున్నారు. ప్రధానిగా ఉన్న మీకు దేశ పౌరుల ప్రాణాలకన్నా యూపీ ఎన్నికల ప్రచారం ముఖ్యమైందా అంటూ మోదీని సూటిగా నిలదీస్తున్నారు. యుద్ధానికి ముందుగా విమాన టికెట్ల ధరలు పెంచేసి దేశానికి తిరిగి వచ్చేయాలని చేతులు దులుపుకోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు.