Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్రపతి ఎన్నికలపై మా అభిప్రాయాలూ కావాలట : ఖర్గే

న్యూదిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతిపక్షాల అభిప్రాయాలను తెలుసుకోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తనతో చెప్పారని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే బుధవారం తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో దేశ రాజధానిలో ప్రతిపక్షాల భేటీకి కొన్ని గంటల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవంగా.. ఎలాంటి వివాదాలు లేని అభ్యర్థి పేరును ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తే ప్రభుత్వం అంగీకరిస్తుందా అని ఖర్గే ప్రశ్నించారు. ‘నేను రాజ్‌నాథ్‌ సింగ్‌తో మాట్లాడా. మా అభిప్రాయాలను ప్రధాని తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన నాతో చెప్పారు. వారి ప్రతిపాదన గురించి అడిగా.. అభ్యర్థుల పేర్లను కోరా. కానీ ఆయన ఏమీ చెప్పలేదు ’ అని ఖర్గే అన్నారు. ఏకగ్రీవంగా ఎటువంటి వివాదాలు లేని అభ్యర్థి పేరును తాము ప్రస్తావిస్తే ప్రభుత్వం అంగీకరిస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img