Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర.. పాల్గొన్న ప్రియాంకగాంధీ..

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది. కాగా ఈ యాత్రలో రాహుల్‌ గాంధీ సోదరి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. రాహుల్‌ తన పాదయాత్రను మధ్యప్రదేశ్‌లోని బోర్గావ్‌ గ్రామం నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్‌ వాద్రా, కుమారుడు రెహాల్‌లతో కలిసి.. రాహుల్‌తో పాటు పాదయాత్రలో అడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను కాంగ్రెస్‌ శ్రేణులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. పాదయాత్రలో పాల్గొన్న ప్రియాంక.. తన సోదరుడు రాహుల్‌తో నవ్వుతూ కనిపించారు. ఇద్దరు చాలా ఉత్సాహంగా అడుగులు వేస్తూ ముందుకు సాగారు. ప్రియాంక గాంధీ రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి. భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. యాత్రలో పాల్గొన్నవారికి, యాత్ర మార్గంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ కూడా భారత్‌ జోడో యాత్రలో పాల్గొని రాహుల్‌తో కలిసి నడిచారు. మరికొద్ది రోజుల్లోనే భారత్‌ జోడో యాత్ర రాజస్తాన్‌లో ప్రవేశించనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img