Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రెండోసారి గుజరాత్‌ సీఎంగా.. భూపేంద్రపటేల్‌

రెండోసారి గుజరాత్‌ సీఎంగా భూపేంద్రపటేల్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్‌ ని కలిసేందుకు బిజెపికి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేలు రాజ్‌ భవన్‌ కి వెళ్లారు. తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాల్సిందిగా గుజరాత్‌ గవర్నర్‌కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. కాగా బీజేపీఎల్‌పీ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా హాజరయ్యారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు భూపేంద్ర పటేల్‌ తన మంత్రివర్గం మొత్తం శుక్రవారం అధికారికంగా రాజీనామా చేసింది. డిసెంబర్‌ 12న గాంధీనగర్‌లోని హెలిప్యాడ్‌ మైదానంలో భూపేంద్ర పటేల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికలకు ముందే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పటేల్‌ను బీజేపీ ప్రకటించింది. గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు గాను 156 స్థానాలు గెలిచి బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img