Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

వారిద్దరి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది

మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీల పనితీరు, పాలనపై పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యలు చేశారు.వీరి పాలనలో పోలికలను ఎంచలేమని, ప్రధానిగా వీరిద్దరి వ్యవహార శైలి వేర్వేరుగా ఉంటుందన్నారు. శుక్రవారం ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను మాజీ ప్రధాని, ప్రస్తుత ప్రధాని మధ్య ఉన్న తేడా ఏంటని అడిగిన ప్రశ్నకు సిందియా సమాధానం చెబుతూ, ాాఇద్దరి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫలితం వచ్చే విధంగా పని చేస్తారు. ఆయన పని విధానంలో కూడా డైనమిజం ఉంటుంది్ణ్ణ అని అన్నారు.మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ సింధియా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత నాలుగు నెలలుగా ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేయడం నాలాంటి బ్యాంకింగ్‌ రంగ నేపధ్యం కలిగిన వారికి మెరుగైన అవకాశంగా భావిస్తానని సింధియా చెప్పుకొచ్చారు.గత ఏడాది సింధియా తిరుగుబాటుతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయింది. సింధియాతో పాటు 25 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. సింధియా ఈ ఏడాది జులైలో మోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కొలువుతీరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img