Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సంపర్క్‌ క్రాంతి రైలు పేరు మార్పు.. ఇక నుంచి అక్షరధామ్‌ ఎక్స్‌ప్రెస్‌గా..

సంపర్క్‌ క్రాంతి రైలు పేరును మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అహ్మదాబాద్‌ – ఢల్లీి మధ్య నడిచే సంపర్క్‌ కాంత్రి ఎక్స్‌ప్రెస్‌ పేరును అక్షరధామ్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఈ రైలు ఢల్లీి, అహ్మదాబాద్‌లోని అక్షరధామ్‌ దేవాలయాలను కలుపుతుందన్న ఆయన.. స్వామినారాయణ సంస్థ చేస్తున్న సేవలకు ఇదో చిరుకానుక అని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌ – ఢల్లీి మధ్య ఈ రైలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల మీదుగా ఢల్లీికి చేరుతుంది. 1074 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటలు ప్రయాణిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img