Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సుప్రీంకోర్టు బయట ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరిలో ఒకరి మృతి


ఇటీవల సుప్రీంకోర్టు బయట ఓ యువతితోపాటు 27 ఏళ్ల యువకుడు నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో యువకుడు శనివారం ఉదయం మరణించాడు. యువకుడికి 65 శాతం గాయాలవ్వగా, 24 ఏళ్ల యువతికి 85 శాతం గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. యువతి చికిత్స పొందుతోందని తెలిపారు. వీరిద్దరూ ఇటీవల సుప్రీంకోర్టు బయట తమ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఫేస్‌ బుక్‌ లైవ్‌లో దాన్ని స్ట్రీమ్‌ చేశారు. యూపీలోని ఘాజీపూర్‌ కు చెందిన ఈ యువతిపై 2019లో బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన ఎంపీ అతుల్‌ రాయ్‌ అత్యాచారం చేశాడని.. ఈ నేరానికి గాను గత రెండేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడని వారు పేర్కొన్నారు. తాను అతుల్‌ రాయ్‌ పై కేసు పెట్టినప్పటి నుంచి కొందరు పోలీసు అధికారుల నుంచి, ఇతరుల నుంచి కూడా బెదిరింపులు అందాయని.. నిందితుడి తరఫు వారు తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెడుతూ వచ్చారని ఈ యువతి తెలిపింది. తనకు ప్రాణహాని ఉన్నందున తన కేసును అలహాబాద్‌ కోర్టు నుంచి ఢల్లీి కోర్టుకు మార్చాలని ఈమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిందని ఢల్లీి పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img