Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

10 మంది అభ్యర్థులతో ఆప్‌ తొలి జాబితా

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో ఉత్సాహంతో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ తుదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 10 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం విడుదల చేసింది.తద్వారా ప్రత్యర్థి పార్టీలకు సవాల్‌ విసిరింది. త్వరలోనే మలి జాబితాను విడుదల చేసేందుకు ఆప్‌ ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తోంది. పంజాబ్‌ లో కాంగ్రెస్‌, బీజేపీలను మట్టికరిపించి అధికారం కైవసం చేసుకున్న ఆప్‌, గుజరాత్‌ లోనూ పటిష్ఠమైన పునాదులు వేసుకోవడంపై దృష్టి సారించింది. నిరుద్యోగులకు నెలసరి రూ.3,000 భత్యం ఇస్తామని ఇప్పటికే ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల హామీ ప్రకటించేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img