Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

5న మణిపూర్‌లోని 12 కేంద్రాల్లో రీపోలింగ్‌

ఇంఫాల్‌ : హింసాత్మకంగా ముగిసిన మణిపూర్‌ తొలిదశ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని 12 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 5న రెండోదశ పోలింగు సందర్భంగా రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28న జరిగిన పోలింగులో చోటు చేసుకున్న ఈవీఎంల ధ్వంసం తదితర చర్యల కారణంగా మొత్తం 12 కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు మణిపూర్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ రాజేష్‌ అగర్వాల్‌ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడిరచారు. తొలిదశలో ఎన్నికలు జరిగిన ఖుండ్రక్‌పామ్‌, సైతు, థన్లోన్‌, హెంగ్లెప్‌, చురచంద్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సరౌథెల్‌, న్యూ కెయిథెల్‌మన్‌ బి, సాంగ్‌సాంగ్‌, మైట్‌, టిన్సువాంగ్‌, మజురాన్‌ కుకీ, ఎన్‌ చింగ్‌ఫీ, ఖోయిరెంటాక్‌, మోల్సాంగ్‌, లీనోమ్‌, టీకోట్‌, మౌకోట్‌ పోలింగు కేంద్రాల్లో రీపోలింగుకు ఏర్పాటు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img