న్యూఢల్లీి: రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున జార?ండ్ మాజీ గవర్నర్, సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముర్ముకు కేంద్రం జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదికి నేటి నుంచి సీఆర్పీఎఫ్ దళాలు భదత్ర ఇవ్వనున్నాయి. ముర్ము ఇవాళ ఒడిశాలోని రాయ్రంగ్పూర్లో ఉన్న శివాలయానికి వెళ్లారు. అక్కడ ఆమె చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత దర్శనం చేసుకున్నారు.