శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో లష్కరేఇ
తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది మృతి చెందినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు. సోపియాన్లో తుర్కవాంగం ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు సమాచారం ఇవ్వగా, ఇందుకోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అనుమానాస్పద ప్రాంతానికి భద్రతా దళాలు చేరుకోగా, అక్కడే నక్కి ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. దానిని సమర్థంగా తిప్పికొట్టే క్రమంలో అదికాస్తా ఎన్కౌంటర్కు దారితీసిందని వివరించారు. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతమవగా, మృతదేహాన్ని ఘటనా స్థలంలో నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. మృతి చెందిన ఉగ్రవాది సోపియాన్లోని తక్మొహల్లాకు చెందిన మునీబ్ అహ్మద్ షేక్గా గుర్తించగా, అతడికి లష్కరేఇ
తోయిబాతో సంబంధాలున్నట్టు తెలిసిందని పోలీసులు వివరించారు.