Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ఎంపీపీ పద్మజా రెడ్డి

గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

అనుమసముద్రంపేట : ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ నవరత్న పథకాలను అందిస్తోందని తద్వారా పేదల ఆర్థిక అభివృద్ధి పెరిగిందని మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి బోయిళ్ళ పద్మజా రెడ్డి తెలిపారు. ఏఎస్ పేట మండలం కావలి ఎడవల్లి సచివాలయం పరిధిలో ఎంపీపీ పద్మజా రెడ్డి ఆ గ్రామ నాయకులతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలను తెలియజేశారు. ఆయా కుటుంబాలకు బుక్లెట్లు అందజేశారు. నవరత్న పథకాల గురించి అవగాహన కల్పించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మాల్యాద్రి నాయుడు, చెంచు రెడ్డి, శ్రీనివాస నాయుడు, వాలంటీర్లు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img