Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజీవయ్య

విశాలాంధ్ర – సూళ్లూరుపేట : తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఆకస్మితిక తనిఖీలు నిర్వహించారు. వంటశాల పాఠశాల గదులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. త్రాగునీరు సమస్య లేకుండా ప్రతిరోజు మున్సిపల్ అధికారులు గురుకుల పాఠశాలకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు కల్పించాలని, అలాగే వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను నీరు నిల్వ ఉండకుండా నీరు వెలుపులకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు .రెండు నెలల లోపల పాఠశాలలో కావాల్సిన మౌలిక వసతులు అన్ని కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. బాత్రూంలు, టాయిలెట్స్ ,శుభ్రంగా ఉంచాలని పాఠశాల ప్రిన్సిపాల్ జయ భారతి కి తెలియజేశారు. గురుకుల పాఠశాల చుట్టూ దాతల సహాయంతో త్వరలోనే ప్రహరీ గోడను కూడా నిర్మించేందుకు ప్రణాళికలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ నాగి శెట్టి నరేంద్ర, మున్సిపల్ చైర్ పర్సన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ,ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ,వైసీపీ నాయకులు ముంగర శేషారెడ్డి ,తుపాకుల ప్రసాదు ,చిన్నిసత్యనారాయణ, చెంగాలమ్మ పాలకమండలి సభ్యులు వంక దినేష్, వెంకటేష్ సులూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి , ఎస్సై రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img