విశాలాంధ్ర బ్యూరో-నెల్లూరు : నెల్లూరు మునిసిపల్ కార్యాలయం లో కమిషనర్ వికాస్ మర్మత్ ని.నెల్లూరు నగరనియోజకవర్గపరిశీలకులుఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి నగరానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు.నెల్లూరు నగరానికి సంబంధించి, అదనంగా కొంత మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించుకొనిఎక్కడ ఇబ్బంది లేకుండాశానిటైజేషన్ చక్కగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ నికోరగాఅందుకు సంబంధించిత్వరలోఅదనపు సిబ్బందినివినియోగించుకొనిఎలాంటి ఇబ్బందులులేకుండాచూస్తామని తెలిపారు.యంపిఆదాలప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎదురుగా సర్వేపల్లి కాలువపైనిర్మించినబ్రిడ్జికిసంబంధించినకొన్నిపనులుపెండింగ్లోఉన్నందున
ఆపనులనుపూర్తిచేసిప్రజలకు అందుబాటులోకితీసుకురావాలని కోరగాత్వరగాపూర్తిచేయిస్తామని కమిషనర్ వికాస్ మర్మత్ తెలియజేశారు.జిజిఎంపిద్వారా జరిగినపనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నందునవాటిని క్లియర్ చేయాలని కోరగాఆబిల్లు లన్నింటినీ పరిశీలించిక్లియర్ చేస్తామని తెలిపారు.స్వర్ణకారులకు సంబంధించినకాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు పాత మున్సిపల్ ఆఫీస్ లో బిల్డింగ్ ను ఖాళీ చేసి క్లియర్ చేయాలని కోరగాఅందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు.
స్వామి వివేకానంద, పొనకా కనకమ్మ ఇలాపలువిగ్రహాలనునగరంలో ఏర్పాటుచేసేందుకుప్రజలనుంచి ఎక్కువగాఅభ్యర్థనలువస్తున్న కారణంగాఆయావిగ్రహాలు ఏర్పాటుకుసహకరించవలసిందిగా కమిషనర్ ని కోరారు.ఇలా అనేక సమస్యల పై చర్చించారు.