Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయాలి – AISF

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ అధికారి ప్రభాకర్ గారికీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ గారు మాట్లాడుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో 2022 ఫిబ్రవరిలో జరిగినటువంటి డిగ్రీ మూడవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేయలేదని ఆయన తెలిపారు.పరీక్షలు నిర్వహించి దాదాపు ఐదు నెలలు గడిచినా యూనివర్సిటీ అధికారులు మూల్యాంకనం చేయకుండా వాటిని పక్కన పెట్టి చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఇటువంటి సంఘటనలు ఈ యూనివర్సిటీలో ఇదేం మొదటిసారి కాదు అని అనేక సంవత్సరాలుగా ఇదే విధంగా ప్రతి పరీక్షలలో జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకనైనా యూనివర్సిటీ అధికారులు మొద్దు నిద్ర మాని విద్యార్థుల సమస్యల పట్ల దృష్టి పెట్టి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా యూనివర్సిటీ అధికారులకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్య మీద వివరణ కోరగా ఈ విషయంపై స్పందించిన అధికారి గారు ఈ సమస్య పైన ప్రతీరోజు తనని విద్యార్థులు వచ్చి అడుగుతున్నారని కచ్చితంగా మరొక 20 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నాయబ్ భాషా,నాయకులు,విద్యార్థులు కె.వంశీ,నవీన్,వినయ్,యం.వంశీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img