విశాలాంధ్ర -పార్వతీపురం : పార్వతీపురం గ్రామీణ సిఐగా ఎస్. గోవిందరావు శుక్రవారంనాడు బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఇక్కడ సిఐగా పనిచేసిన కె .రవికుమార్ ఎస్ కోటకు బదిలీకావడంతో ఆయనగోవిందరావుకు బాధ్యతలు అప్పగించి శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఎన్నికల ముందు సిఐగా విచ్చేసిన రవికుమార్ మంచిఅధికారిగా పేరు తెచ్చుకున్నారు. రవికుమార్ సమైక్యాంధ్ర ఉద్యమకాలంలో ఉమ్మడి జిల్లాలో సీతానగరం ఎస్సైగా కూడా పనిచేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన గోవిందరావు మెరైన్ నుండి విచ్చేశారు. ఆయన గతంలో విజయనగరం ఉమ్మడిజిల్లాలో బొబ్బిలి సీఐగా కూడా పనిచేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సిఐ గోవిందరావు మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉండేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన జాయిన్ అయ్యాక జిల్లా ఎస్పీ సబ్ డివిజన్ ఏఎస్పీ తదితర అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను సర్కిల్ పరిధిలోని సీతానగరం, బలిజిపేట, కొమరాడ, పార్వతీపురం ఎస్సైలు రాజేష్,పాపారావు, నీలకంఠం,దినకర్ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. ఇంతవరకు పనిచేసిన సీఐ
కె.రవికుమార్ కు వారు వీడ్కోలు పలికారు.