Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఈక్రాప్ పంట నమోదును పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి

విశాలాంధ్ర – జె పంగులూరు : మండలంలోని బైట మంజులురు గ్రామం లోని ఈ పంట నమోదు కార్యక్రమమును గురువారం రైతులతో కలిసి పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలను ఈ నెల 31 లోపు ఈ పంట నమోదు చేయించుకోవాలని దీని వలన ఉచిత పంటల బీమా, పండిన పంటను కోనుగోలు కేంద్రంలో అమ్ముకొనుటకు, కొనుటకు మరియు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన కూడా నష్ట పరిహారం పొందటానికి అవకాశం ఉన్నది కావున ప్రతి పంట సాగు చేసిన రైతు సోదరుడు మీ మీ రైతు భరోసా కేంద్రం పరిధిలోని రైతు భరోసా సిబ్బందిని మరియు గ్రామ రెవెన్యూ అధికారిని కలసి పంట నమోదు చేయించుకోవలసినదిగా కోరారు.
అదే విధంగా ఈ నెల 31లోపు పి యం కిసాన్ ఈ కే వై సి చేయించుకొని వారు వెంటనే పూర్తిచేయిన్చుకోవలేనని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వి ఏ ఏ మరియు వి అర్ ఒ ఉమామహేశ్వరరావు
మరియు రైతులూ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img