విశాలాంధ్ర =వలేటివారిపాలెం : ఆర్థికఅక్షరాస్యత, బ్యాంకింగ్ వ్యవస్థ బ్యాంకు లావాదేవీల నిర్వహణపై విద్యార్థులకు బాల్యం నుండే అవగాహన అవసరమని స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారం, సూచనలమేరకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మండలంలోని ఆరు పాఠశాల విద్యార్థినీ,విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత మీద మండల స్థాయి క్విజ్ పోటీలు బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. బ్యాంకు సేవలు గూర్చి వివరించారు. క్విజ్ పోటీల్లో చుండి ఆదర్శ పాఠశాల , జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల పోకూరు,నలదలపూరు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్ధులు ప్రథమ, ద్వితీయ తృతీయ స్థానాలు సాధించినట్లు తెలిపారు.గెలుపొందిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున,ప్రధానోపాధ్యాయులు కమల్ కుమార్,ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్ బహుమతులు అందజేసి అభినందించారు ఈకార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఆయాపాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.