Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

రసాభసగా సర్వ సభ్య సమావేశం

-ప్రజా సమస్యలపై జరగని చర్చ

  • యథాప్రకారంగా వివాదస్పదంగానే ఎంపీడీవో తీరు
  • టైంపాస్ ఎంపీడీవో’పై జడ్పీటీసీ సభ్యురాలు ఆగ్రహం

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : మండల సర్వసభ్య సమావేశం మరోసారి రసాభసగానే ముగిసింది . సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే విమర్శలు , ప్రతివిమర్శలు , వ్యంగ్యపు వ్యాఖ్యల నడమ సమావేశం ముగిసింది . సభ్యులు కూడా ఇలావచ్చి ఘర్షణపడి అలా వెళ్లిపోయారు . దీంతో సమావేశం జరిగిందీ అనిపించి ముగించారు . అయితే సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదు . బుధవారం ఉదయం 11.30 గంటలకు ముందుగా సమావేశం ప్రారంభమైంది . ఎంపీపీ నలమలపు అంజమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముందుగా ఎంపీడీవో ప్రారంభోపన్యాసం చేశారు . అనంతరం జడ్పీటీసీ సభ్యురాలు యాదాల రత్నభారతి మాట్లాడుతూ .. ఎంపీడీవో వ్యగ్యంగా మాట్లాడడంపై విమర్శలు గుప్పించారు . సమావేశానికి ముందు మర్యాద పూర్వకంగా పలకరించిన సమయంలో ఎంపీడీవో తనది టైంపాస్ ఉద్యోగమని వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలన్నారు . ఇన్చార్జ్ ఉన్నప్పటికీ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు . గ్రూప్ -1 అధికారులు సైతం జవాబిదారిగా ఉంటారన్నారు . ప్రజాప్రతినిధులతో ఎలా నడుచుకోవాలో తెలియదా … ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇదే క్రమంలో సమావేశంలోని జడ్పిటిసి మాట్లాడుతుండగా ఓ నామినేటెడ్ ప్రజాప్రతినిధి ఇక చాలు అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు . ఈ క్రమంలో కొద్దిపాటి గందరగోళం నెలకొంది . అనంతరం వైద్యశాఖలో పురోగతిపై వైద్య అధికారి వివరిస్తుండగా , సదరు అధికారిని ఎంపీడీవో శ్రీనివాసరావు డయాస్ దిగి మాట్లాడాలని వ్యాఖ్యానించారు . దీనిపై సదరు అధికారి కూడా ఎంపీడీవో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు . తాను కూడా గజిటెడ్ అధికారినేని ప్రగతి నివేదికలు తెలియజేసే సమయంలో కనీసం మర్యాద ఇవ్వాలని సదరు ఉద్యోగి ఎంపీడీవోను వ్యాఖ్యానించడం గమనార్హం . ఇక ఇదే క్రమంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు వివిధ పనులకు సంబంధించి తీర్మానాలివ్వాలని కోరారు . శాఖల సమీక్ష అనంతరం దీనిపై చర్చిద్దామని ఎంపీపీ పేర్కొనగా , కొంత మంది ఆహ్వానితులు గందరగోళ పరిచారు . దీంతో సమావేశం మధ్యలోనే ముగిసింది . సమావేశాన్ని ముగిస్తూ ఎంపీపీ , జడ్పీటీసీలు కిందికి వెళ్లారు . దీంతో పలువురు సభ్యులు తమకు మెజారిటీ ఉందని తాము అడిగిన తీర్మానాలు తమకు ఇవ్వాలని పట్టుబట్టారు . ఆ మేరకు మరోసారి సమావేశాన్ని నిర్వహించాలని ఎంపీడీవోకు అర్జీ ఇచ్చారు . దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ , ఎంపీపీ అనుమతితో మరోసారి సమావేశం నిర్వహించాలని ఆయన కూడా పేర్కొన్నారు . అనంతరం తన చాంబర్ కు వెళ్లారు . సభ్యులు కూడా తిరిగి వెళ్లిపోయారు . ఇక సమావేశానికి ప్రత్యేకాధికారి అంజలీ హాజరయ్యారు . అనంతరం తన చాంబర్లో ఎంపీడీవో మాట్లాడుతూ .. ప్రభుత్వాధికారులుగా తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img