Friday, May 3, 2024
Friday, May 3, 2024

అనారోగ్యంతో విద్యార్థిని మృతి

విశాలాంధ్ర -నాగులుప్పలపాడు : మండలంలోని ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన తవణం లక్ష్మయ్య కుమార్తె తవణం స్నేహ డిగ్రీ చదువుతుంది. విద్యార్థిని ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. మంగళవారం వారి పార్థివ దేహానికి ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి యదాల అశోక్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్నేహ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట మాదాసు రాంబాబు, పేరాల చెన్నకేశవులు, కొంజేటి సురేష్, తెలగతోటి జాన్సన్, యాదాల నాగరాజు, కనుమూరి ఆంజనేయులు, కందుల శ్రీను, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img