లండన్ : ఐపీఎల్ రెండో దశ నుంచి ఇద్దరు ఇంగ్లాండ్ క్రికెటర్లు వైదొలిగారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్స్టో, పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. దీంతో ఆయా జట్లకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కరోనా కారణంగా అర్ధాం తరంగా ఆగిపోయిన ఐపీఎల్ 14, సెప్టెంబర్ 19న యూఏఈలో తిరిగి ప్రారంభంకానుంది.
క్వారంటైనే కారణమా?
మాంచెస్టర్ నుంచి యూఏఈకి ఇంగ్లండ్, టీమిండియా క్రికెటర్లు కలిసే ప్రయాణించాల్సి ఉంది. అయితే పర్యాటక జట్టులో కరోనా కలకలం వల్ల వేరుగానే వెళ్తున్నాయి. దుబాయ్కి వచ్చే ప్రతి ఆటగాడు తప్పనిసరిగా ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధన కూడా బెయిర్స్టో, మలన్ తప్పుకోవడానికి ఓ కారణమై ఉంటుందని సమాచారం. ఇక దిల్లీ క్యాపిటల్స్కు ఆడే ఇంగ్లాండ్ ఆర్రౌండర్ క్రిస్ వోక్స్ కూడా ఐపీఎల్లో ఆడటంపై అనుమానం నెలకొంది.