Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

సిల్వర్‌ మెడల్‌ సాధించిన రవికుమార్‌ దహియా
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ను మరో పతకం వరించింది. పురుషుల రెజ్లింగ్‌లో రవికుమార్‌ దహియా రజతం సాధించాడు. ఫురుషుల 57 కేజీల విభాగంలో గురువారం రష్యాకి చెందిన యుగేవ్‌ జావుర్‌తో ఫైనల్లో తలపడిన రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా 4-7 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. రజతంతో సరిపెట్టుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఇప్పటికే వెయిల్‌లిప్టర్‌ మీరాబాయి చాను రజత పతకాన్ని అందివ్వగా.. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ లవ్లీనా కాంస్య పతకాలు అందించారు. ఈరోజు ఉదయం ఫురుషుల హాకీ టీమ్‌ కాంస్య పతకం గెలుపొందగా.. తాజాగా రవి కుమార్‌ దహియా రజతం గెలుపొందడంతో భారత్‌ పతకాల సంఖ్య ఐదుకి చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img