రాంచీ : న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ టి20 క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గప్టిల్ అగ్రస్థానంలో నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్లో 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత సాధించాడు. ఇక మ్యాచ్లో 31 పరుగులు చేసిన ఔటైన గప్టిల్ ఇప్పటివరకు కివీస్ తరపున 111 మ్యాచ్ల్లో 3246 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో టాప్లో ఉన్న కోహ్లిని దాటి మార్టిన్ తొలి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి 95 మ్యాచ్ల్లో 3227 పరుగులు చేశాడు. ఇక రోహిత్ శర్మ 118 మ్యాచ్ల్లో 3086 పరుగులతో మూడో స్థానంలో.. ఆస్ట్రేలియా నుంచి కెప్టెన్ ఆరోన్ ఫించ్ 83 మ్యాచ్ల్లో 2608 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.